సిరా న్యూస్,చిత్తూరు;
చౌడేపల్లి మండలం ,దిగువ పల్లిలో వెలసిన ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం లో మాఘమాసం సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే లక్ష కుంకుమార్చన పూజ కార్యక్రమాన్ని ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మన్ వి.నాగరాజ రెడ్డి ఈ.ఓ.చంద్రమౌళి వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు లక్ష కుంకుమార్చన పూజ కార్యక్రమంలో163 దంపతులు పాల్గొన్నారని ఆలయ ఈవో తెలిపారు.