సిరా న్యూస్, ఆదిలాబాద్ రూరల్
ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన
* పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వి గ్రామంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం గురువారం కన్నుల పండవగా జరిగింది. ఈసందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయాన్ని దర్శించారు .ఆలయ కమిటీ సభ్యులు వారిని సాదరంగా స్వాగతించారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,మాజీ ఎంపీపీ మంచికట్ల ఆశమ్మ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,బాయిన్ వార్ గంగా రెడ్డి, తమ్మల చందు, బూర్ల శంకరయ్య, కోరేటి కిషన్ లను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మోర హన్మాండ్లు,గౌరవ అధ్యక్షులు కామన్ విట్టల్,ఆలయ కమిటీ చైర్మన్ జిట్ట రమేష్,ఆలయ ప్రధాన కార్యదర్శి వెంకట స్వామి,ఉప అధ్యక్షులు జిట్ట నర్సింగ్,బొమ్మకంటి రమేష్,గ్రామస్తులు గోపతి గజనన్,రాంసం విట్టల్,గొపే వెంకటేష్,సుదర్శన్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.అనంతరం జైనథ్ మండలం కోరాట గ్రామంలోని శ్రీ ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించారు. నూతన శివాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులను గ్రామస్తులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో గ్రామస్తులు ఆడేల్లు,గంగా రెడ్డి,రామన్న,పాట్న అమూల్ తదితరులు పాల్గొన్నారు.