సిరా న్యూస్,కమాన్ పూర్;
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుదిల్ల శ్రీధర్ బాబు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు రామగిరి మండలం సెంటినరీ కాలనీలో పాలాభిషేకం గురువారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం మరో రెండు ఇలాంటి పథకాలను అమలు శ్రీకారం చుట్టి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు మరియు 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ప్రారంభించడంతో కాంగ్రెస్ పార్టీ సెమినార్ కాలనీ టౌన్ అధ్యక్షురాలు పబ్బతి రాధారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. సందర్భంగా రామగిరి ఎంపీపీ ఆర్ దేవక్క కొమురయ్య గౌడ్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… పేద ప్రజలకు అండగా ఉండేందుకే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుదిల్ల శ్రీధర్ బాబు పథకాలను రూపొందించడం జరిగిందని అన్నారు. కాగా సిలిండర్ ధర 500 తగ్గించడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలతో ధరలు కొండెక్కి కూర్చున్నాయని పేద ప్రజలకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించడం జరిగిందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను టిఆర్ఎస్ ప్రభుత్వం తీసివేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి బీసీ సెల్ అధ్యక్షుడు బండారి సదానందం ప్రచార కమిటీ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, ఎంపీటీసీలు కోప్పుల గణపతి ఎస్సీ సెల్ అధ్యక్షుడు సండే పోషం నాయకులు తీగల సమ్మయ్య మోత్కూరి నవీన్ మురళీకృష్ణ శ్రీధర్ వీణ ఆర్చి త్రీ ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డి ఆరెల్లి విజయ టేక్కేర్ల స్వరూప శ్రీరాముల వనిత తరంగిణి తదితరులు పాల్గొన్నారు.