-కెడిసిసి బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్
సిరా న్యూస్,మంథని;
లోన్ యాప్, లాటరి, పార్ట్ టైం జాబ్స్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, పాన్ కార్డ్స్ అప్డేట్, ఆదార్ కార్డు లింకేజి పేరుతో మెసేజెస్, ఓటిపిలు రాగనే ఆశపడి ఓపెన్ చేసి మోసపోవద్దని కెడిసిసి బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్ అన్నారు. గురువారం మంథని మండలం ఖానాపూర్ గ్రామములో నిర్వహించిన ఆర్ధిక అక్షరాస్యత, ఘర్ ఘర్ కెసిసి అభియాన్ అవహగాహన సదస్సులో కెడిసిసి బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్ మాట్లాడుతూ, గూగుల్ లో లోన్స్ యాప్స్ కోసం సెర్చ్ చేయడం కానీ చేయవద్దని, నేరగాళ్ళు మన అకౌంట్ లో కొంత ముందుగా డబ్బులు జమ చేసి ఆ తదుపరి మన అకౌంట్ లోని డబ్బులను కాజేస్తారని అన్నారు. సైబర్ నేరగాల్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరాలు చేస్తారని, డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే ప్రతీ ఒక్క రైతుకు పంట ఋణం అందించేందుకు బ్యాంకు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణ పంపిణి చేస్తున్నామని తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. సహకార క్రాంతి డిపాజిట్ పథక౦ 546 రోజులకు గాను సాధారణ పౌరులకు 7.50, సీనియర్ సిటిజన్లకు 8శాతం వడ్డీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సహకార బ్యాంక్, సంఘాల ద్వారా అందిస్తున్న ఋణాలను రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సహకార బ్యాంక్ ద్వారా పాడిపశువులు, గొర్రెలు, పండ్లు, ఆయిల్ ఫాం తోటల పెంపకం, పాలీహౌస్లు, పవర్ టిల్లర్స్, గోదాంలకు, ట్రాక్టర్స్, హర్వేస్టర్లు, గోల్డ్ లోన్స్, స్వయం సహాయక సంఘాలకు, గృహ నిర్మాణాలు, కొనుగోళ్లకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు వ్యక్తిగత, విదేశీ విద్యా, మార్టిగేజ్, ఎస్ హెచ్ జి, జెఎల్ జీ, ఇళ్ల రిపేరుకు, ఇంటిరియర్ డెకరేషను, పీఎంఇజిపి, కార్పొరేషన్ ఋణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే సహకార బ్యాంక్ ద్వారా యూపిఐ, ఐఎంపిఎస్, గూగుల్ పే, ఫోన్ పే, ఆన్లైన్ సేవలు ఖాతాదారులకు అందుబాటులో ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సేమంతుల ఓదేలు, దొరగొర్ల శ్రీనివాస్, పెద్ద సంఖ్య లో గ్రామస్తులు పాల్గొన్నారు.