జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
సిరా న్యూస్,జగిత్యాల;
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలలో భాగంగా గురువారం రోజున 97.13 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7049 మందికి గాను 6875 మంది పరీక్షలు హాజరయ్యారని, 174 మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న అరవింద్ నగర్ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆయా సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, తదితరులు పాల్గొన్నారు