కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలను బయటికి తీస్తాం

-మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు కొడుకు కాదు అయ్యే రావాలి

-విచారణకు ఆదేశిస్తే భయమెందుకు

-లక్షల కోట్ల అవినీతిలో ఎవరి వాటా ఎంత…?

-టిపిసిసి ఎన్నికల కమీషన్ కో ఆర్డినేషన్ కమీటీ సభ్యుడు శశిభూషణ్ కాచే

 సిరా న్యూస్,మంథని;
కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలను బయటకు తీసి ప్రజల ముందు పెడతామని టిపిసిసి ఎన్నికల కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు శశి భూషణ్ కాచే అన్నారు. గురువారం మంథనిలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శశి భూషణ్ కాచే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే కాలేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ మ్యారేజి కుంగి పోయిందన్నారు. అప్పుడు సీఎం గా ఉన్న కెసిఆర్ ఎందుకు మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించలేదని ప్రశ్నించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరిగే సమయంలో కాంక్రీట్ వర్క్ జరిగేటప్పుడు నిబంధనలు పాటించకపోవడం వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీని మా నేత రాహుల్ గాంధీ సందర్శించేందుకు వచ్చిన సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. బ్యారేజ్ నీ సందర్శించిన రాహుల్ గాంధీ పై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పగుళ్లు కూడా తెలియదని కామెంట్ చేశారన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ల వారసుడు అని కూడా చూడకుండా కేటీఆర్ విమర్శలు చేశారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంగిపోయిందనీ విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ అవకతవుకల్లో ఇంజనీర్ ఇన్ చీఫ్ నుండి మొదలుకొని నాయకుల వరకు అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు.కాలేశ్వరం ప్రాజెక్టు పై వాస్తవ విషయాలు తెలియజేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును విజిలెన్స్ కు అప్పగించిందన్నారు. విజిలెన్స్ అధికారులు కాలేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి మూడు కేసులను ఫైల్ చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పుట్ట మధుకు ప్రజలు ఓటు ద్వారా తీర్పునిచ్చారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటికి తీసి ప్రజల ముందు పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో అవినీతి, అక్రమాలు చేసిన వారే మళ్లీ సందర్శించేందుకు వస్తుండడం విడురంగా ఉందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న బీఆర్ఎస్ నాయకత్వానికి స్వాగతం పలుకుతున్నామన్నారు. కానీ కేటీఆర్ కాకుండా కెసిఆర్ రావాలన్నారు. కెసిఆర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చి ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న మంథని నియోజకవర్గం లోని ఆయా గ్రామాల రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మంథని నియోజకవర్గం లోని రైతులకు సాగునీరు అందించేందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతులకు ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా గురువారం సాయంత్రం నుంచే సాగునీరు అందుతుందన్నారు. ఈ సమావేశంలో మంథని ఎంపీపీ కొండ శంకర్, వైస్ ఎంపీపీ స్వరూప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు పోలు శివ, వర్కింగ్ ప్రసిడెంట్ బూడిద శంకర్, పేరవేన లింగయ్య,జాగిరి సదానందం,కాసిపేట బాపు,ప్రభాకర్, తో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *