Payal Shankar:మోడీని ఘనంగా స్వాగతిద్దాం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
మోడీని ఘనంగా స్వాగతిద్దాం
* ఆదిలాబాద్ ప్రజలకు ఇది మరో పండుగ
* 4న ఆదిలాబాద్‌కు మోడీ రాక‌
* ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
* నరేంద్ర మోడీ బహిరంగ సభకు సన్నాహక సమావేశం
విశ్వ నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ కు రావడం, ఇది ఆదిలాబాద్ ప్రజలకు ఒక పండగ లాంటిదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నరేంద్ర మోడీ సభకు సన్నాహక సమావేశాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పాయ‌ల్ శంక‌ర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. మార్చి 4వ తేదీన నరేంద్ర మోడీ ఆదిలాబాద్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. ఆదిలాబాద్ నుండి బేల మీదుగా మహారాష్ట్ర వైపు వెళుతున్న మార్గానికి 450 తో పనులకు శంకుస్థాపన, 220 కోట్ల రూపాయలతో పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు శంకుస్థాపన, ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు బహిరంగ సభ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని తమ వంతు కృషిగా చేయాలని అన్నారు. ఈ సన్నాక సమావేశంలో ఉమ్మడి జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బహిరంగ సభను జయప్రదం చేద్దాం…
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జులా ప్రేమేందర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ కార్యక్రమం మార్చి నెలలు కూడా విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ బహిరంగ సభ అనంతరం సంగారెడ్డి లో కూడా బహిరంగ సభ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఉంటుందని అన్నారు.
మోడీని ఘనంగా స్వాగతిద్దాం…
ప్రధాని నరేంద్ర మోడీ తన పాలన మొదలు పెట్టిన దగ్గర నుంచి మొదటిసారి ఆదిలాబాద్ కు విచ్చేస్తున్న సందర్భంగా ఆయన సభను విజయవంతం చేద్దామని బీజేపీ నాయ‌కులు అన్నారు. నరేంద్ర మోడీ ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. ఆదిలాబాద్కు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందించిన ఘనత నరేంద్ర మోడీ ది మాత్రమేనని అన్నారు. ఆయన సభను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ స‌మావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *