occult worship:వంగరలో క్షుద్ర పూజల కలకలం

సిరా న్యూస్, భీమదేవరపల్లి
వంగరలో క్షుద్ర పూజల కలకలం
* మూఢనమ్మకాలను నమ్మొద్దు
* వంగర ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు
టెక్నాల‌జీని అందిపుచ్చుకోవ‌డంలో ప్ర‌పంచం ముందుకు సాగుతున్నా కొంత మంది క్షుద్ర‌పూజ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.
భీమదేవరపల్లి మండ‌లం వంగరం నుండి మాలపల్లి గ్రామమధ్యలో రొడ్డం దగ్గర మూఢనమ్మకాల పేరుతో మేక పిల్లను కోసి క్షుద్ర పూజలు చేసి అక్కడే వదిలేసి వెళ్లారు. క్షుద్ర పూజ‌ల పేరుతో సామాన్య ప్ర‌జ‌ల‌ను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో ప్రజలు, స్కూల్ పిల్లలు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మవద్దని వంగర ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *