సిరా న్యూస్, ఆదిలాబాద్
మాలీల ఎస్టి హోదాపై మోడీ స్పందించాలి
* సామాజిక న్యాయం అందించేలా భాజపా ప్రభుత్వం కృషి చేయాలి
* మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల నాలుగో తేదీన అదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్న సందర్భంగా అసెంబ్లీ లో మాలీల ఎస్.టి హోదా బిల్లు పాసై ఆమోదం కోసం కేంద్రానికి పంపిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న బిల్లు పై ప్రధానమంత్రి స్పందించి మాలికులస్తులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ గత 23 సంవత్సరాలుగా ఆంధ్రాలో ఎస్టీలుగా ఉండి తెలంగాణలో బీసీలుగా ఉన్న మాలికులస్తులు తెలంగాణ మాలిలకు ఎస్టీ హోదా కావాలని అనేక పోరాటాలు చేశారని మాలీల పోరాటాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత2023 ఫిబ్రవరి 10వ తేదీన అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపడం జరిగిందని అది కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని రాబోయే ఎన్నికలలో కేంద్రం ఆమోదించి మాలిలకు ఎస్టీ హోదా కల్పిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించాలని కోరారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్న మాలికులస్తులకు ఎస్టీ హోదా లభించడం వలన సామాజిక న్యాయం పొందగలుగుతారని, మహాత్మ జ్యోతిరావు పూలే వారసులైన మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించి సామాజిక న్యాయం అందించేలా భాజపా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.