Threetown Police: పోగొట్టుకున్నబ్యాగు అంద‌జేత‌

సిరా న్యూస్, అనంతపురం
పోగొట్టుకున్నబ్యాగ్‌ అంద‌జేత‌
* త్రీటౌన్ పోలీసుల‌ను అభినందించిన జిల్లా ఎస్పీ
ల్యాప్ టాప్, విలువైన డాక్యుమెంట్లు కల్గిన బ్యాగును త్రీటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకొని, బాధితుడికి అప్ప‌గించారు. త్రీటౌన్ సి.ఐ ధరణీ కిశోర్ తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. బెంగుళూరు నుండీ హైదరాబాద్ వెళ్తున్న ఓ కారులో తెలంగాణకు చెందిన దివేష్ గుప్తా ప్రయాణించారు. ఈరోజు ఉదయం అనంతపురం ఆర్టీసీ బస్టాండు వద్ద సదరు కారు డ్రైవర్ దివేష్ గుప్తాను దింపేసి వెళ్లిపోయారు. ఆ కారులో ల్యాప్ టాప్, విలువైన డాక్యుమెంట్లు కల్గిన బ్యాగును మరచిపోయాడు. కొద్దిసేపటికి గుర్తు తెచ్చుకునేలోపే కారు హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లి పోయింది. ఆ కారు నంబర్ కూడా దివేషా గుప్తా గుర్తుంచుకోలేదు. వెంటనే అనంతపురం త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. సి.ఐ ధరణీ కిశోర్, ఆయన సిబ్బంది రంగంలోకి దిగారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఈ సర్వేలెన్స్ కు అనుసంధానమైన నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న సి.సి.కెమేరాల ద్వారా ముందుగా కారు నంబర్ గుర్తించారు. తద్వారా కారు యజమానిని గుర్తించి ఆయనను కాంటాక్టు చేశారు. వెంటనే ఆ బ్యాగును తెప్పించి దివేష్ గుప్తాకు అప్పగించారు. ల్యాప్ టాప్ తో పాటు విలువైన డాక్యుమెంట్లు కల్గిన బ్యాగును పోలీసులు సకాలంలో స్పందించి చాకచక్యంగా తెప్పించి అప్పగించడంపై ఆయన పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతపురం త్రీటౌన్ సి.ఐ ధరణీ కిశోర్, ఆయన సిబ్బందిని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *