Amylineni Surendra Babu:ధర్నాకు మ‌ద్ద‌తు తెలిపిన అమిలినేని సురేంద్ర బాబు

సిరా న్యూస్, కళ్యాణదుర్గం
ధర్నాకు మ‌ద్ద‌తు తెలిపిన అమిలినేని సురేంద్ర బాబు
* ఏపీటిఎఫ్ నూతన భవనాన్ని పూర్తి చేస్తామని హామీ
స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఉపాధ్యాయ సంఘం ఏపీటిఎఫ్ వారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఎదుట ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ ధ‌ర్నాకు కళ్యాణదుర్గం టిడిపి అభ్యర్తి అమిలినేని సురేంద్ర బాబు శుక్రవారం మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఆయ‌న మాట్లాడుతూ మీ ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు మా టిడిపి నేత లోకేష్ బాబు టిడిపి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పరిష్కరించాడనికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నియోజకవర్గం తరపున భవిష్యత్ లో మా మద్ధతు కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏపీటిఎఫ్ ఉపాధ్యాయ భవనం నిర్మాణం లో అసంపూర్ణగా ఉన్న విషయం ఉపాధ్యాయులు మా దృష్టికి తెచ్చారాని,వీలు అయిన్నంత త్వరగా భవనం పూర్తి చేసి ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు వారికీ కృతజ్ఞతలు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *