Collector Gautami:ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

సిరా న్యూస్, అనంతపురం
ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
* జిల్లా కలెక్టర్ గౌతమి
* ప‌రీక్షా కేంద్రాల త‌నిఖీ
ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఎస్.ఎస్.బి.ఎన్ జూనియర్ కళాశాలలో, కెఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలను మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. మొత్తం మొదటి, రెండవ సంవత్సరం కలిపి 41,556 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరుగుతోందని తెలిపారు. పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిఈఓ వెంకటరమణనాయక్, ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *