సిరా న్యూస్, జైనథ్
బిఆర్ఎస్ హయంలో అభివృద్ధి శూన్యం
* బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ప్రజలపై ఉంది
* బిజెపి జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి
* సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ
దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోనే జరిగిందని గొప్పలు చెప్పుకున్న మాజీ మంత్రి జోగు రామన్న పదేళ్లలో దీపాయిగూడ గ్రామంలో చేసిన అభివృద్ధి శూన్యమని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి లోకా ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా, జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ రూపాయల 10 లక్షల నిధులతో ఐదు సిసి రోడ్ల నిర్మాణానికి ఆయన ఎంపిటిసి లోకా కరుణాకర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేసే పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా లోక ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ పల్లెలే పట్టణాలకు పట్టుబొమ్మలని గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందన్న ఆశయంతో ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు అన్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో పలు గ్రామాలు అభివృద్ధికి లక్షలు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాజీ మంత్రి జోగు రామన్న గ్రామమైన దీపాయిగూడలో 10 ఏళ్లలో వారు చేయనటువంటి అభివృద్ధి పనులకు బిజెపి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ముందుగా రోడ్ల అభివృద్ధి చేపట్టడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో మండలంలో అనేక గ్రామాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం లో అభివృద్ధికి నోచుకోనటువంటి పల్లెలను గుర్తించి రోడ్లు మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ప్రజలపై ఉందని అన్నారు. బిజెపి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఇందులో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.