ఇంటర్ పరీక్ష రాసేందుకు వస్తున్న విద్యార్దికి గాయాలు

సిరా న్యూస్,సికింద్రాబాద్;
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు వస్తుండగా రహదారి ప్రమాదం జరిగి ఓ విద్యార్థినికి గాయాలు కాగా అక్కడే ఉన్న మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స చేయించి విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్నారు..ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థిని తన తండ్రితోపాటు ద్వి చక్ర వాహనం పై పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా సికింద్రాబాద్ ఎం జి రహదారి తపస్య కళాశాల వద్ద అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో ఆ విద్యార్థిని తలకు గాయాలయ్యాయి. అక్కడే విధులు నిర్వహిస్తోన్న మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉపాశంకర్ గమనించి వెంటనే తన వాహనంలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరీక్షా కేంద్రంలో ప్రిన్సిపల్ అనుమతి తీసుకుని ఆమెను ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఏడు కుట్లు వేయించారు. అనంతరం సమయానికి తిరిగి పరీక్ష కేంద్రంలో వదిలిపెట్టగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *