సిరా న్యూస్,శ్రీకాకుళం;
పాలకొండలో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రఘువర్మ మాట్లాడుతూ… ప్రభుత్వం నేడు అనుసరిస్తున్న విధానాలను వివరించారు. సిపిఎస్ ను రద్దు చేయాలని, పిఆర్సీని వెంటనే రిలీజ్ చేయాలని ,నేటి వరకు ఉన్న డీఎలు ఇవ్వాలని,పి ఎఫ్ బకాయిలను ఇవ్వాలని సూచించారు.ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచన చేశారు. 117 జి వో ను వెంటనే రద్దు చేయాలని రఘువర్మ కోరారు .మూడు నాలుగు తరగతుల విలీనం ప్రాథమిక వ్యవస్థకే గొడ్డలి పెట్టని అభివర్ణించారు .50 వేల పోస్టులు ఖాళీగా ఉన్న 6000 పోస్టులకే డీఎస్సీ ఇవ్వడం చాలా దారుణమని అన్నారు. అదే విధంగా ఎలక్షన్ వ్యవస్థ అవగాహన లేని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ఎన్నికల నిర్వహణ చేయాలని ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని విరమించుకొవాలని కోరారు..ఎలక్షన్ కమిషన్,సుప్రీంకోర్ట్,హైకోర్ట్ ఉత్తర్వులు ప్రకారము ఎలక్షన్ చేయడానికి మా ఉపాద్యాయులు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు .అదే విధంగా విద్యాశాఖ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ సంస్కరణ దిశగా విద్యా వ్యవస్థను తీసుకువెళ్లాలని , ఆయన ఆలోచన మారాలని కోరారు.