జాబ్ పేరుతో మోసం

పోలీసుల అదుపులో నిందితుడు
కవిత, డీసీపీ, సైబర్ క్రైమ్
 సిరా న్యూస్,హైదరాబాద్;
ఎంఎన్సీ కంపెనీలో జాబ్ పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు. ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సీనియర్ ఎంప్లాయ్ ని అని నిందితుడు సీతయ్య చెప్పాడు. బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ గా బ్యాక్ డోర్ లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి రెండున్నర లక్షల బాధితుడు పవన్ నుంచి తీసుకున్నాడు. ఫేక్ ఆఫర్ లెటర్ ని బాధితుడు పవన్ కి పంపించాడు. బాధితుడు కంపెనీకి వెళ్లగా ఇదంతా ఫేక్ అని కంపెనీ వాళ్ళు చెప్పారు. నిందితుడు సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యి… రెండు సార్లు ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళాడు. నిందితుడు మరో ఆరు కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. డబ్బులిస్తే జాబ్ ఇప్పిస్తామని చెప్పేవాళ్ళని నమ్మకూడదని ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *