భారీగా జరిమాన
సిరా న్యూస్,రాజేంద్రనగర్;
రెండు మూడు రోజులు నిల్వ ఉంచిన భోజనాన్ని కస్టమర్లకు విక్రయిస్తున్న హోటల్ ఎస్ వి ఎం గ్రాండ్ నిర్వాకం బయటపడింది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ మెరుపు దాడులు నిర్వహించారు. హైదర్గూడా లో ఉన్న ఎస్వీఎం గ్రాండ్ వెంగమాంబ రెస్టారెంట్ లో అధికారులు మెరుపు తనకిలు నిర్వహించారు. ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన పాచి పోయిన తందూరి చికెన్ ను అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ హోటల్ పై పలు ఫిర్యాదులు అందినట్లుగా డిప్యూటీ కమిషనర్ రవికుమార్ తెలిపారు. హోటల్ ఎస్ వి ఎం గ్రాండ్ యాజమాన్యంపై సీరియస్ అయిన అధికారులు భారీగా జరిమాన విధించారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ హెచ్చరించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పలు హోటల్లో తనిఖీలు నిర్వహిస్తామని నిబంధనలకు విరుద్ధంగా ఫ్రిజ్ లో దాచి ఉంచిన బిర్యానీ చికెన్ ఐటెంస్ 65 లను కస్టమర్లకు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.