Bhimadevarapalli:పూర్వ‌ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…

సిరా న్యూస్, భీమదేవరపల్లి
పూర్వ‌ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…
వీరంతా చిన్న‌ప్పుడు ఒకే చోట చ‌దువుకున్నారు. ప‌దో త‌ర‌గ‌తి పూర్తయ్యాక పై చ‌దువుల కోసం మ‌రికొంద‌రు ఉద్యోగం కోసం వెళ్లారు. మ‌ళ్లీ వీరంద‌రూ ఒకే చోట క‌లుసుకున్నారు. భీమదేవరపల్లి మండలంలోని మల్లారం ప్రభుత్వ పాఠశాలలో 1998- 1999 వ సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు 25 సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చదువు నేర్పిన గురువులు దేవయ్య, యాదగిరి,చీకట్ల తిరుపతి, గూడెల్లి రాజిరెడ్డి, పలువురిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను గుర్తుగా అందజేశారు.. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఆనాటి మధురమైన పాఠశాల జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకున్నారు. అనంతరం దేవయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు వారికి భవిష్యత్తును ప్రసాదిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *