సిరా న్యూస్, ఆదిలాబాద్
ఎస్టీ హోదా కల్పించాలి
మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే
* పాయల్ శంకర్ను కలిసిన మాలీ మహా సంఘం నేతలు
మాలిల ఎస్టీ హోదా విషయంలో ఇకనైనా ఆలస్యం చేయకుండా కేంద్రం స్పందించి రాబోయే పార్లమెంటు ఎన్నికలలోపే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని, ఎస్టీ హోదా కల్పించాలని సుకుమార్ పేట్కూలే అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మె ల్యే పాయల్ శంకర్ను మాలీ మహా సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగో తేదీన జిల్లాకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి మాలీల ఎస్టీ హోదా అంశంతో పాటు ఇతర సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. మాలీలకు సామాజిక న్యాయం లభించాలని గత 23 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి “మాలిల ఎస్టి హోదా బిల్లు”ను అసెంబ్లీలో పాస్ చేయించి కేంద్రానికి పంపడంలో సఫలీకృతమయ్యామని తెలిపారు.కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శేండే, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు అడ్వకేట్ ఉమేష్ రావు ఢోలే ఉన్నారు.