కానిస్టేబుల్ ప్రాణం తీసిన రోడ్డు గుంత

సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. కానిస్టేబుల్ సురేశ్ పాలకొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం పాలకొండకు వెళ్తుండగా గుంతను తప్పించబోయి అదుపుతప్పి బైక్ మీద నుంచి కిందపడ్డాడు. దాంతో అతడి తలకు తీవ్రంగా గాయమైంది. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *