సిరా న్యూస్,విజయవాడ;
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శనివారం టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు అయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వసంత మాట్లాడుతూ వైసీపీలో నాకు ఎలాంటి గౌరవం దక్కలేదు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నదే నా కోరిక. చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తా. లేదంటే పార్టీ కోసం పనిచేస్తా. ఏపీ అభివృద్ధి పథంలో సాగాలంటే చంద్రబాబే సీఎం కావాలి. చంద్రబాబు, లోకేశ్ నాయకత్వంలో అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి కృషి చేస్తానన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే తాను అక్కడ బరిలో దిగుతానన్నారు.