కిలివెటి సంజీవయ్యను గెలిపించాలి

మంత్రి పెద్దిరెడ్డి
సిరా న్యూస్,సూళ్లూరుపేట;
సూళ్లూరుపేట నియోజకవర్గం లో వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయ సమావేశం జరిగింది. రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గోన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి సూళ్లూరుపేట నియోజకవర్గం లో గతం కంటే గొప్ప మెజారిటీ సాధించాలని సమావేశం లో చర్చ జరిగింది.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ఒక కుటుంబం లాంటిది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇక్కడకి వచ్చాను. ఎమ్మెల్యే సంజీవయ్య అందరితో కలిసి ముందుకు సాగుతారు. సూళ్లూరుపేట నియోజకవర్గం కు సిఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చిన్న చిన్న విబేధాలు అన్ని పార్టీల్లో సహజం… అవి పక్కన పెట్టీ ఎన్నికల విజయం కోసం కృషి చేయాలని అన్నారు. మనమంతా కలిసి పని చేసి కిలివేటీ సంజీవయ్య ను గెలిపించాలి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేను నిరంతరం అందుబాటులో ఉంటా. అందరిని కలుపుకుని సంజీవయ్య ముందుకు సాగుతారు. మనమంతా సిఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పని చేస్తున్నాం. మన పార్టీని మనం గెలిపించుకోవాలి. ఎమ్మెల్యే సోదర భావంతో అందరినీ కలుపుకుని ముందుకు సాగుతారు. పార్టీ పరంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా మేమంతా అండగా ఉంటాం. గతంలో భారీ మెజారిటీతో సూళ్లూరుపేటలో విజయం సాధించాం. ఈసారి ఎన్నికల్లో మరింత మెజారిటీతో గెలిచేలా కృషి చేయాలి. సూళ్లూరుపేట వైసిపికి పట్టు ఉన్న నియోజకవర్గం… అది కొనసాగుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *