“మేము సిద్ధం మా బూత్ సిద్ధం “కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డిసచివాలయ కన్వీనర్ – తులసి రెడ్డి,
సిరా న్యూస్,సి. బెలగల్;
సి. బెలగల్ మండలం బ్రాహ్మణదొడ్డి, బూరందొడ్డి గ్రామ సచివాలయంలో నిర్వహించిన “మేము సిద్ధం మా బూతు సిద్ధం ” కార్య క్రమంలో పాల్గొన సి. బెలగల్ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి సచివాలయ కన్వీనర్లు తులసిరెడ్డి, .అనంతరం సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో వైఎస్సార్సీపీ గెలుపు కోసం బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త ఇంటింటి వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. .అనంతరం తులసీ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కోడుమూరు లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి సతీష్ ను గెలిపించి జగన్ మోహన్ రెడ్డి కానుక ఇవ్వాలని కోరారు. అందుకోసం ప్రతీ ఒక్క కర్యాకర్త ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరవాత చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకూ వివరించాలని కోరారు అనంతరం మేము సిద్ధం మా బూతు సిద్ధం కర పత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్య క్రమంలో వైఎస్ఆర్సీపీ సర్పంచు దస్తగిరి,రాఘవేంద్ర,అంజి ఎంపీటీసీలు బాబర్,మౌలాలి,ప్రభాకర్ సచివాలయ కన్వీనర్ శేఖర్ రెడ్డి, రామచంద్ర రెడ్డి,శ్రీను,ప్రకాష్,సంజీవరెడ్డి వాలంటీర్లు, కార్య కర్తలు , ప్రజలు పాల్గొన్నారు.