సిరా న్యూస్,తుగ్గలి;
తుగ్గలి మండలం పరిధిలోని రాంకొండ గ్రామ పంచాయతీలో గల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తుగ్గలి ఎంపీడీఓ అధికారిని విజయలక్ష్మి శనివారం రోజున తనిఖీ చేశారు.ఈ తనిఖీలో భాగంగా సచివాలయ రికార్డులను పరిశీలించి సచివాలయ సిబ్బందితో వివరాలను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా గ్రామ పంచాయతీలో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ రాంకొండ పరిసర ప్రాంతాలలోని రైతులు ఉపాధి హామీ పనులకింద చేసుకున్నటువంటి హార్టికల్చర్ పండ్ల తోటల సాగును రైతులు సద్వినియోగం చేసుకోవాలని,గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతులకు మరియు ఉపాధి కూలీలకు పనులను కల్పించి పనులకు తగ్గ వేతనాలను అందివ్వాలని ఎంపీడీఓ విజయలక్ష్మి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎపివో రామకృష్ణ యాదవ్,పంచాయతీ సెక్రటరీ ఆంకాలప్ప,టెక్నీకల్ అసిస్టెంట్ జయరాం, రాంకొండ సీనియర్ మేటి కె చాణిక్య,రాంకొండ జూనియర్ మేటి ఎన్ భూపతి రాజు తదితరులు పాల్గొన్నారు.