సిరా న్యూస్, బేల:
చాంద్పల్లి లో పల్స్ పోలియోను ప్రారంభించిన జడ్పిటిసి అక్షిత పవర్…
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాంద్పల్లి గ్రామంలో ఆదివారం జడ్పిటిసి అక్షిత పవర్ పల్స్ పోలియో కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలన్నరు. ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీ, పర్యాటక ప్రాంతాలు, బస్టాండ్లతో పాటు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారని అన్నారు. ప్రతీఓక్కరు పల్స్ పోలియోను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చాంద్పల్లి మాజీ సర్పంచ్ జంగ్షావ్, అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవర్, నాయకులు శేకు, చంద్రభాన్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.