సిరా న్యూస్, భీమదేవరపల్లి
అన్ని గ్రామాలలో కమిటీలు
* రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
* మల్లారంలో నూతన సభ్యత్వం
తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ పేర్కొన్నారు. అనంతరం మల్లారం గ్రామంలో నూతన సభ్యత్వాల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్, మండల కన్వీనర్ ఏలుర్తి ప్రేమ్ రాజ్, మండల కో కన్వీనర్ జెర్రిపోతుల ఐలయ్య, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు డ్యాగలసారయ్య, జోడుముంతల వెంకటస్వామి, సిద్ధమల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.