CM Revanth Reddy in Adilabad: ఆదిలాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై 

సిరా న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై 

పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై ఆదిలాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లలో బయలుదేరిన వారు సోమవారం ఉదయం పట్టణంలోని ఏరోడ్రం లో ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్ద లాండ్ అయ్యారు. వీరికి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పి గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఆదిలాబాద్ కు చేరుకోగా ఆయనకు జిల్లా ఉన్నత స్థాయి అధికారులు స్వాగతం పలికారు. పట్టణంలోని స్థానిక ఇంద్ర ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభ కంటే ముందు దాదాపు రూ. 6 వేల కోట్లతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ అధికారిక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *