సిరా న్యూస్, బాపట్ల
బీజేపీ అంతం… మాలల పంతం
* మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డా. పసుల రాంమూర్తి
* కిషన్ రెడ్డి పై 100 మంది పోటీ చేయాలి
* హలో.. మాల చలో బాపట్ల విజయవంతం
బీజేపీ అంతం… మాలల పంతమని మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డా. పసుల రాంమూర్తి అన్నారు. బాపట్ల క్రిస్టియన్ గ్రౌండ్ లో ఎస్ సి వర్గీకరణ కు వ్యతిరేకంగా మాలల సింహగర్జన సభ, మాల మహా సభ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు రెండు రాష్ట్రల మాల సంఘాల జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సభ అధ్యక్షులు మాల మహా సభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు రెండు రాష్టాల మాలలను ఉద్దేశించి 10 తీర్మాణాలు అందరి అభిప్రాయం తో చేశారు. ఎస్ సి, ఎస్ టీ రిజర్వేషన్ లను వర్గీకరణ ను వ్యతిరేకస్తూసుప్రీం కోర్టు రాజ్యాంగధర్మశానం తీర్పు ఇవ్వకముందే వర్గీకరణ చేయమని సర్కిలేషన్ కలెక్టర్ ఆఫీస్ లకు పంపడాన్ని తప్పు పడుతున్నామన్నారు.
బాపట్ల పార్లమెంట్ లో మాలలు 5లక్షలు ఉన్నందుకు మాల అభ్యర్థికే అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలని, తెలుగు దేశం పార్టీపశ్చిమ గోదావరి క్రిష్ణ కడప 65 శాతం జనాభా మాలలు ఉంటే కనీసం మాలలకు ఒక్క సీటు కూడా ఇవ్వక పోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్ టీ ల క్రిమిలేయర్ మినయింపు రిజర్వేషన్ లను కందిస్తూ తీర్మానం చేయడం అయిందన్నారు.ఎస్ సి, ఎస్ టీ ల రాజ్యాంగ హక్కులను రిజర్వేషన్ భంగం కలిగిస్తున్న ఇంద్ర సహాని కేసు జడ్జి మెంట్ నాగరాజు కేసు జడ్జిమెంటు ను హత్యాచార కేసులల్లో అరెస్ట్ చేయకుండా 41 సి ఆర్ పి సి నోటీసు లు ఇచ్చే తీర్పులను రివ్యూ చేయాలనీ అన్నారు. రాజ్యాంగ ధర్మసానం ముందు పిటిషన్ లు వేయాలని తీర్మానం చేశారు. బుడుగ జంగాలు కురువ కూరభ బి సి కులాలను ఎస్ సి లల్లో కలపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా జి ఓ లను రద్దు చేయాలని పేర్కొన్నారు. ఎస్ సి ఎస్ టీ బి సి మ్యానార్టీ విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం పూర్తి ఫీజు రీయంబర్స్ను నిరాకరించే 77జి ఓ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డా పసుల రాంమూర్తి మాట్లాడుతూ ఎస్ సి వర్గీకరణ చేస్తానని ముందుకు వస్తున్న బి జె పి పార్టీని రెండు రాష్టల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సిటు కూడా రాకుండా ఒడిoచాలని పిలుపు నిచ్చారు. మంద క్రిష్ణ మాదిగ మనువాదన్ని తీసుక రావడానికి ప్రయత్నం చేస్తూన్నారన్నారు. కేంద్ర మంత్రి బి జె పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పై 100 మంది అభ్యర్థులను బరిలో నిలుపు తమని హెచ్చరించారు. అంబేద్కర్ వాదాన్ని లేకుండా చేస్తానని భ్రమలు కంటున్నా బి జె పి పార్టీ ని ఓటు తో ఒక్క గుద్దు గుద్ధి చీత్తు గా ఒడించాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, డా పసుల, రాంమూర్తి, గొల్ల అరుణ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షులు ముత్యామల పుల్లయ్య, బొజ్జ శరత్ కరుణమ్, కిషన్, పౌల్ తాటి కుమార్, రసూజు రమేష్ , బూర్గుల వెంకటేశ్వర్లు, బేతలా, శరత్, కొండబాబు ప్రాన్సు తడి తరులు పాల్గొన్నారు.