చదివిన కాలేజీకి ఐదు కోట్లు విరాళమిచ్చిన పూర్వ విద్యార్ది

సిరా న్యూస్,;
ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల అనుబంధం కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ బిల్డింగును పూర్వ విద్యార్థి 1968 బ్యాచ్ కి చెందిన గోపాల్ టీ కే కృష్ణ 5 కోట్ల ఆర్థిక సహాయం అందించారు.దానికి గాను ఓయూ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రో. రవీందర్, రిజిస్ట్రార్ ప్రో.లక్ష్మీనారాయణ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రో.చంద్రశేఖర్,ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన గోపాల టి కే కృష్ణ మాట్లాడుతూ నేను ఉస్మానియా యూనివర్సిటీలో 1963 నుంచి 68 వరకు చదువుకొని 1968 లో ఓయూ నుంచి పట్టా సాధించాను. మా గురువుగారైన నరసింహన్ పేరు నిలబెట్టాలనే ఉద్దేశ్యం తో బిల్డింగ్ కు ఆయన పేరు పెట్టడం జరిగిందన్నారు. నేను అమెరికాలో స్థిరపడిన కూడా చదువుకున్న యూనివర్సిటీకి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో బిల్డింగ్ కు పూర్తి వ్యయం 10 కోట్లు కాగా నా వంతుగా కట్టడానికి 5కోట్లు రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఇంకా సంపాదించి ఇంకా ఇవ్వాలనే ఆశ నాలో ఉందన్నారు. పూర్వ విద్యార్థులందరూ వారి కుటుంబంతో పాటు చదువుకున్న యూనివర్సిటీకి ఏదైనా తోడ్పాటు అందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *