Prabhakar Reddy:గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు

సిరా న్యూస్, సైదాపూర్‌
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు
* ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి
* సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ‌
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మల‌ని ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమ‌వారం సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి సీసీ రోడ్లు పనిని ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో రూ.5 లక్షల ఉపాధి హామీ నిధులతో 3లక్షల ఎంపీపీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలోని గ్రామాలకు అధిక నిధులు ఇవ్వాలని గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని ఆయన అన్నారు.సీసీ రోడ్ల మంజూరు పనిని పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో సైదాపూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్ , పీఆర్ ఏఈ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి,మాజీ ఎంపీటీసీ బైరి రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు జాల రాజు, గుర్రాల మహేందర్ రెడ్డి, రేగుల సమ్మయ్య, దాసరి మల్లయ్య, కుట్ల రవి,పెసరు తిరుపతి, దోనపాటి చంద్రారెడ్డి , కొంపల్లి రాజిరెడ్డి, దాసరి సందీప్,మ్యాకల అంజి , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *