సిరా న్యూస్,మేడ్చల్;
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉప్పల్ లో తెలంగాణ రాష్ట్ర మహిళ మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అధ్వర్యంలో మహిళలలో కలిసి ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా హబ్సిగూడ, రామంతాపూర్ కార్పొరేటర్లు కక్కిరెని చేతన, బండారి శ్రీవాణి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీకి శిల్పారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మహిళల గురించి ఆలోచించిన మొట్ట మొదటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.మహిళల ఆత్మ గౌరవం కాపాడుటకోసం రాష్ట్రంలో ముఫై నాలుగు లక్షల స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.అన్ని వర్గాల మహిళల కోసం ప్రధాని మోడీ అనేక పథకాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు శిల్పారెడ్డి.ఈ ర్యాలీలో ఉప్పల్ నియోజక వర్గ పది డివిజన్ల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.