సిరా న్యూస్,హైదరాబాద్;
హస్య నటుడు బాబు మోహన్ సోమవారం నాడు ప్రజాశాంతి పార్టీలో కేఏ పాల్ ఆధ్వర్యంలో చేరారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అని కేఏ పాల్ తెలిపారు. గతంలో పనిచేసిన పార్టీలో విలువ లేకనే తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు బాబు మోహన్ వెల్లడించారు. బిజెపిలో పార్టీ కొరకు ఎంతో పనిచేశా. కానీ తనకు సరైన పదవి, గౌరవం లేకనే ఆ పార్టీని వేడాల్సి వచ్చిందని అన్నారు.
పార్టీ కొరకు ఎంతో సేవ చేసిన తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన బాబు మోహన్. రానున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుని తప్పక విజయం సాధిస్తానని అయన పేర్కొన్నారు.