Srinivasa Reddy:క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం

సిరా న్యూస్,ఆదిలాబాద్‌
క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం
* కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీనివాస రెడ్డి
* క్రికెట్ పోటీ నిర్వాహ‌కుల‌కు ప్రోత్సాహం
* ఫ‌స్ట్ ప్రైజ్ కోసం ప‌దివేల న‌గదు అందజేత
క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం క‌లుగుతుంద‌ని కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయం, ప్రజా సేవా భవన్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, ప్ర‌జలు, అభిమానుల రాక‌తో సంద‌డిగా మారింది. ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల‌ గ్రామపంచాయితీ ప‌రిధిలోని పోతాగూడ -2 గ్రామానికి చెందిన జైకుంరం, సూరు యూత్ స‌భ్యులు ఆయ‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసారు.త‌మ‌ యూత్ అసోషియేష‌న్ ఆధ్వ‌ర్యంలో క్రికెట్ టోర్నమెంట్ గురించి తెలియ‌చేసారు.టోర్నీ విజేత‌కు న‌గ‌దు బహుమతి కోసం ప‌దివేల రూపాయల ను కంది శ్రీనివాస రెడ్డి టోర్న‌మెంట్ నిర్వాహ‌కుల‌కు అందజేసారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,రాజ్ మొహమ్మద్,రషీద్ ఉల్ హాక్,యాల్ల పోతా రెడ్డి,అల్లూరి భూమ రెడ్డి, బాసా సంతోష్, సయ్యద్ షాహిద్ అలీ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *