సిరా న్యూస్,ఆదిలాబాద్
గవర్నర్, సీయంలను కలిసిన కంది శ్రీనివాస రెడ్డి
* పలు సమస్యలను సీఎం దృష్టికి
ఆదిలాబాద్ తో పాటు తెలంగాణ లో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయడానికి జిల్లా కేంద్రానికి విచ్చేసిన ప్రధాని మోదీకి స్వాగతం పలకడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల సమావేశంలో పాల్గొనడానికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ,తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ కొచ్చారు. సమావేశ ప్రాంగణం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి వారిని మర్యాద పూర్వకంగా కలిసారు.నియోజక వర్గానికి సంబంధించిన పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు,ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంఛార్జ్ శ్యామ్ నాయక్ , టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు