శివనామ స్మరణతో మారుమోగుతున్న శివాలయాలు

హైదరాబాద్‌ ,(సిరా న్యూస్);

శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. కార్తిక పౌర్ణమి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో దీపారధన చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతున్నది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది.కార్తిక మాసం రెండో సోమవారం కావడంతో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తాయి. మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉండటంతో పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గంగాధర మండపం, ఉత్తర శివమాఢ వీధిలో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. దీంతో మల్లికార్జుని దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *