సిరా న్యూస్, ఆదిలాబాద్:
మోడీ పర్యటనతో ఆదిలాబాద్కు ఒరిగింది శూన్యం…
+ మాజీ మంత్రి జోగు రామన్న
+ బీజేపీ, కాంగ్రెస్ బంధం బయటపడిందని వ్యాఖ్య
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనతో ఆదిలాబాద్ ప్రజలకు ఒరిగిందేమి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న వ్యాఖ్యానించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడా భాయ్, చోటా భాయ్ ఒకే వేధికపై నిర్వహించిన సభ ద్వార ఖాజానాకు ఖర్చు తప్ప ఇంకేమి లేదని ప్రధాని మోడీ, సీఎం రేవంత్ను ఉద్దేశించి అన్నారు. మోడీ పర్యటనపై ఆదిలాబాద్ ప్రజలు కోటి ఆశలతో ఉండగా, తీవ్ర నిరాశే మిగిలిందని అన్నారు. సీసీఐ పునరుద్ధరణ, టెక్స్టైల్ పార్క్, ఆదిలాబాద్–ఆర్మూర్ లైన్ వంటి ప్రజల చిరకాల వాంచలను గురించి మోడీ మాట్లాడకపోవడం, ఆదిలాబాద్ ప్రజలను అవమానించడమేని ఆయన దుమ్మెత్తి పోసారు. ఈ సభ ద్వార బీజేపీ, కాంగ్రెస్ అంతర్గత సంబంధాలు బహిర్గతం అయ్యాయని, జిల్లా అభివృద్ధి కనీసం హామీలు కూడ ఇవ్వని ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పొగిడారో? సమాధానం చెప్పాలన్నారు. ఆదిలాబాద్ సమస్యలపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, భోరజ్–బేల జాతీయ రహాదారిని రెండు వరుసల్లో నిర్మించడం ఆదిలాబాద్పై వివక్షకు నిదర్శనమన్నారు. వెంటనే ఈ జాతీయ రహాదారిని నాలుగు వరుసలుగా మార్చాలని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసారు. ఆదివాసీలపై కేంద్రం కపట ప్రేమను ప్రదర్శిస్తోందని అన్నారు. అన్ని చోట్ల సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ప్రకటించిన బీజేపీ, ఆదిలాబాద్ టికెట్ విషయంలో ఎందుకు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్ను విమర్శించే అర్హత లేదని ఆయన అన్నారు. ఆదిలాబాద్ ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిన బీజేపీ పార్టీకి ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి, ప్రజల పక్షానా పోరాడే బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నాయకులు రోకండ్ల రమేష్, అలల అజయ్, సర్సన్ లింగారెడ్డి, విజ్జగిరి నారాయణ, గండ్రత్ రాజు, బుట్టి శివకుమార్, దాసరి రమేష్, రాజు, ఆశన్న, తదితరులు పాల్గొన్నారు.