సిరా న్యూస్,మేడ్చల్;
నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీకర పెస్టిసైడ్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
================