నల్లమల అటవీమార్గంలో పాదయాత్ర

శ్రీశైలానికి వేలాదిగా తరలివెళ్తున్న భక్తులు

సిరా న్యూస్,శ్రీశైలం;
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి దేవాదిదేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన శివస్వాములు, సాధారణ భక్తులు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు నల్లమల అంత ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది శివరాత్రి సమీపిస్తుండటంలో రాయలసీమ,కోస్తా,తెలంగాణ,కర్ణాటక ప్రాంతాల నుండి మహిళలు,వృద్ధులు,చిన్నారులు మల్లన్న తండ్రి అదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని భక్తులంటున్నారు నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే శివస్వాముల భజనలతో మార్మోగుతున్న శ్రీశైలం వైద్య సదుపాయాలు బాగున్నాయని అడవి మార్గంలో బీమకొలను మీదుగా కొండెక్కి శివస్వాములు పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్న భక్తుల కోసం దేవస్థానం అధికారులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కాలినడకన నల్లమల నుండి వచ్చే భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారని పాదయాత్ర భక్తుల కోసం అడవిమార్గంలో రాళ్లు రప్పలు లేకుండా కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు దారి వెంట ట్రాక్టర్లతో నీరు చల్లడం వచ్చే భక్తులకు మార్గమధ్యలో అన్నదాన ఏర్పాటు చేశారు వెంకటాపురం నుండి దట్టమైన అటవీప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటున్న వస్తున్న పాదయాత్ర భక్తుల కోసం పలువురు దాతలు కూడా మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషంగా ఉందని పలువురు భక్తులు,శివస్వాములు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *