సిరాన్యూస్, నిర్మల్
వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో నైపుణ్యన్ని పెంచుతాయి..
* కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
* విద్యార్థులు పట్టుదలతో చదవాలి
* ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల నైపుణ్య సామర్థ్యాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైజ్ఞానిక ప్రదర్శనలలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల నైపుణ్య, సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతీ విద్యార్థి ప్రశ్నించడం, నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలలోని 300 మంది విద్యార్థులు వైజ్ఞానిక ఆవిష్కరణలు ప్రదర్శించడం సంతోషకరమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు మరింత చురుగ్గా పాల్గొనే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు.
విద్యార్థులు పట్టుదలతో చదవాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
విద్యార్థులు భవిష్యత్ లో గొప్ప శాస్రవేత్తలుగా ఎదిగేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు.అంతకుముందు నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీ.ఈ.ఓ రవీందర్ రెడ్డి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమాధికారి పీ.వై. రమేష్, డిటిడిఓ అంబాజీ, ప్రజా ప్రతినిధులు, ఎం.ఈ.ఓ లు, ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.