సిరా న్యూస్,కాళహస్తి;
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని మూడవ రోజున భక్తవత్సలుడైన శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యప్రభ వాహనంపై, జ్ఞానప్రసూనాంబన అమ్మవారిని చప్పరం వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు.సూర్యుభగవానుడు తన తేజోమయమైన కిరణాలనుకోటిసూర్యప్రకాశుడైన స్వామివారి పాదాలను స్పృశిస్తుండగా,భక్తకోటికి దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు నిరాజనాల పడుతూ స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు.