మడకశిర టీడీపీలో కుమ్ములాటలు

సిరా న్యూస్,మడకశిర;
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర తెలుగుదేశం పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం ఒకవైపు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గం మరోవైపు ఎడమొహం పెడమొహంగా వుంటున్నారు. తాజాగా  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి  సునీల్ కుమార్ అభ్యర్థిగా వద్దంటూ గుండుమల తిప్పేస్వామి వర్గం ఈరోజు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ర్యాలీలో భాగంగా చంద్ర అనే కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పుంటించుకునే ప్రయత్నం చేశాడు. మడకశిర ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థిగా సునీల్ కుమార్ ను తప్పించి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో అక్కడ ఉన్న తోటి కార్యకర్తలు, గుండుమల తిప్పేస్వామి వెంటనే అప్రమత్తమై, చంద్ర వంటిపై నీళ్ళు పోసి ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.  ఈ నెల 7వతేదీన నారా లోకేష్ మడకశిర పర్యటన నేపథ్యంలో వర్గ విభేదాల నిప్పు ఎలా రాజూకుంటుందో అని మడకశిర ప్రజలు చర్చించు కుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *