వైద్యం కోసం వస్తే డాక్టర్ వేధింపులు

సిరా న్యూస్,ఖమ్మం;
తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి డివిజన్ వైద్యాధికారి డాక్టర్ టి సీతారాం వికృత చేష్టలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విస్సన్నపేటలో కీర్తన ప్రైవేట్ ఆసుపత్రి ద్వారా సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే మహిళలపై వేధింపులకు గురిచూస్తున్నాడు. ఈ నేపధ్యంలో విస్సన్నపేట రాజీవ్ కాలనీ గ్రామానికి చెందిన బాధితులు ఆందోళనకు దిగారు. అక్క గర్భసంచి ఆపరేషన్ నేపథ్యంలో కీర్తన ఆసుపత్రిలో రాత్రి తోడుగా చెల్లెలు వుంది. రాత్రి టైంలో ఒంటరిగా చూసి డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించారు. విషయం తెలిసిన బంధువులు ఆసుపత్రిని ముట్టడించారు. కిటికీ అద్దాలు ధ్వంసం చేసారు. డాక్టర్ సీతారాం పరారీలో వున్నాడు. విసన్నపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *