సిరాన్యూస్, బోథ్
గెలుపు కోసం కృషి చేయాలి
* ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు
* కాంగ్రెస్ కరపత్రాల ఆవిష్కరణ
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ కరపత్రలు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆవిష్కరణ చేశారు. అనంతరం వెడ్మ బోజ్జు మాట్లడుతూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్ ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా చేయాలి ప్రతి ఇంటికీ కంపెయినింగ్ ఎలా చేయాలి ఏ విధంగా మన పార్లమెంట్ స్థానాన్ని గెలిపించడం కోసం అందరం కష్టపడాలి అని తగు సూచనలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో నిర్మల్ డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు , యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ ఇసాక్ షేరు ,నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాయి చరణ్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ నాగరాజు వేముల, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గుడాల అనీష్ కుమార్, యువ నాయకులు రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు