భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి కాణిపాకం దేవస్థానం తరుపున పట్టువస్త్రాలు సమర్పణ

సిరా న్యూస్,శ్రీశైలం;
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి ఐదవ రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా కాణిపాకం దేవస్థానం తరుపున కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ ఈవో వెంకటేష్ ,చైర్మన్ మోహన్ రెడ్డి దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కాణిపాకం దేవస్థానం అధికారులు,ట్రస్ట్ సభ్యులకు శ్రీశైలం ఆలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి ఈవో పెద్దిరాజు, కాణిపాకం దేవస్థానం ఈవో,చైర్మన్ అర్చకులు,అధికారులకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలను శ్రీస్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించగా అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనలిచ్చి దీవించారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *