సిరా న్యూస్, కళ్యాణదుర్గం
శివరాత్రి ఉత్సవాలకు తలారి రంగయ్యకు ఆహ్వానం
అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్యను బుధవారం కళ్యాణదుర్గం లోని వారి క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ భవానీ శంకర్ స్వామి ఆలయం లో జరగబోయే మహా శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు. అనంతరం ఆహ్వానం పత్రిక అందజేశారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం శ్రీ భవానీ శంకర్ స్వామి ఆలయం ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు. పాల్గొన్నారు