Vinita Srinivas Reddy: సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సిరా న్యూస్, చిగురుమామిడి
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
మాహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులతో సీసీ రోడ్డు పనులను బుధ‌వారం ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో బొమ్మనపల్లి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణం కోసం 15.00 లక్షలు,లాలయపల్లి 3.00 లక్షలు మంజూరు కాగా పలువురు ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, దాసరి ప్రవీణ్ కుమార్, మాచమల్ల రమణయ్య, కత్తుల దేవేందర్, మిట్టపల్లి మల్లేశం, పెండల సదానందం,మామిడి సంపత్, మాచమల్ల కిషోర్, మడమడకల రాజిరెడ్డి,మిట్టపల్లి ఆదర్శ్,మల్లికార్జున్ రెడ్డి, సత్యం రెడ్డి,గంప తిరుపతి, రమణారెడ్డి, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *