సిరా న్యూస్,విశాఖపట్నం;
దేశంలో అన్ని ప్రాధాన్యత లు ఉన్న నగరంగా విశాఖకు గుర్తింపు ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.విశాఖ కలెక్టర్ కార్యాలయం వెనుక 25.30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ భవన కాంప్లెక్స్ను ఆయన ప్రారంభించారు. అనంతరం భవన సముదాయాన్ని పరిశీలించి మాట్లా డారు. ఈ భవన సముదాయంలో ఆర్థిక శాఖకు సంబంధించిన అన్ని విభాగాలను తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా ట్రెజరీ శాఖ, పే అండ్ అకౌంటెంట్, ఆడిట్ విభాగం తదితర కార్యాలయాలను ఒకే కాంప్లె క్స్లో ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ అభివృద్ధికి ప్రణాళిక ప్రకటించారని.. రానున్న రోజుల్లో విశాఖ పరిపాలన కేంద్రంగా మారనుందన్నారు. గడిచిన రెండేళ్లలో విశాఖలో అనే రకాల మౌలిక సదుపా యాలు కల్పించినట్లు చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన యువతకి ఎంతో మేలు చేస్తుందన్నారు.