సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారంలో డైట్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ను బీసీ వెల్ఫేర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదిప్ దురషెట్టి ,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డీఈవో , ఇతర అధికారులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ డైట్ కాలేజీ అకాడమిక్ బ్లాక్ 4 కోట్ల రూపాయల తో నిర్మించుకున్నం. దేశ పౌరులను ,విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల కేంద్రం ఇది. ఇది టీచర్ల శిక్షణ నిర్వహణ కేంద్రం. డైట్ కాలేజీ లో బీఈడీ శిక్షణ కూడా ఇచ్చే విధంగా ముందుకు పోతాం. డైట్ కాలేజీ వేరే ప్రాంతం నుండి ఇక్కడి రావడం వల్ల నేషనల్ కౌన్సిల్ లో రికగ్నేషన్ కోల్పోయిందని అన్నారు. కాలేజీ రికగ్నేషన్ కోల్పోవడం పై కాలేజీ ప్రిన్సిపల్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహంవ్యక్తం చేసారు . రికగ్నేషన్ కోల్పోవడం పై తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదు ప్రశ్నించారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తామని అన్నారు. .