సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం రైల్వే స్టేషన్లో మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న యువకుడికి చికిత్స చేపించి కుటుంబ సభ్యులకు అన్నం ఫౌండేషన్ అప్పగించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహస్ర జిల్లా భగవాన్పూర్ కు చెందిన 20 ఏళ్ల రంజిత్ కుమార్ అనే యువకుడు ఖమ్మం రైల్వేస్టేషన్ లో బట్టలు లేకుండా తిరుగుతూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నరు.ఇటీవల అతన్ని రైల్వే ఎస్ఐ భాస్కర్ రావు ఆధ్వర్యంలో అన్నం సేవాశ్రమంలో చేర్పించారు. అక్కడ అన్నం శ్రీనివాస రావు ఆ యువకుడికి వైద్యం చేయించి ఆరోగ్యం కొంత మెరుగు అయిన తరువాత అతని వివరాలు తెలుసుకొని ఉత్తర్ ప్రదేశ్ లోని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చిన బంధువులకు రైల్వే ఎస్ఐ సమక్షంలో రంజిత్ కుమార్ ను అన్నం శ్రీనివాసరావు వారికి అప్పగించారు. తమ సోదరుడిని కాపాడి వైద్యం చేపించి అప్పగించిన అన్నం ఫౌండేషన్ కు యువకుడి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.