ఎల్ఆర్ఎస్ పై ధర్నా

పాల్గోన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
సిరా న్యూస్,జహీరాబాద్;
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్దీకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎమ్మెల్యే మాణిక్ రావు పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఎన్నికల ముందు హస్తం పార్టీ ఇచ్చిన హామీ అమలు చేయాలని రుసుములు వసూలు చేయకుండా ఉచితంగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలను రుసుముల పేరిట దోచుకుంటే ఆందోళనలు తప్పవని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవోకు ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *